Venkatesh : ‘వెంకీ 76 ‘ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనా?

News

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘హిట్’ ‘హిట్ 2 ‘ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను దర్సకత్వంలో ‘సైందవ్’ అనే సినిమా చేస్తున్నారు. ‘జర్సీ’ బ్యుటీ శ్రద్దా శ్రీనాథ్ ఈ చిత్రంలో వెంకీ సరసన కనిపించనుంది. ఈ చిత్రం కథ మొత్తం హీరో కూతురి పాత్ర చుట్టూ తిరుగుతుంది అని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలకు బాగా కలిసోస్తున్న ఫార్ములా ఇది. అవును తమ పిల్లలు లేదా మనవరాలు, మనవడు వంటి వారిని కాపాడుకునే పాత్రల్లో సీనియర్ హీరోలు కనిపిస్తే.. వాళ్ళ ఏజ్ కి ఇమేజ్ కి తగ్గట్టు ఉంటుంది. అది ప్రేక్షకులకి కుడా కన్విన్సింగ్ గా అనిపించడం వల్ల… మంచి ఫలితాలు అందుతున్నాయి. అందుకే  ‘సైందవ్’ పై మంచి అంచనాలే ఉన్నాయి. అది పక్కన పెట్టేస్తే.. !

వెంకటేష్ తన 75 సినిమా కంప్లీట్ అయ్యాక.. ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే ప్రశ్న.. అతని అభిమానుల్లో ఉంది. దానికి సమాధానంగా సురేందర్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అవును వెంకటేష్ కి సురేందర్ రెడ్డి ఓ కథ చెప్పడం.. అది వెంకీకి నచ్చడం.. ఓకే చెప్పేయడం .. వంటివి చక చకా జరిగిపోయాయి అని  సమాచారం. ఈ చిత్రానికి సీనియర్ రచయిత భారతీ రాజా కథ అందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే డైలాగ్ వెర్షన్ అంతా సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీలు.. రెడీ చేసుకుంటారట. అయితే ఈ ప్రాజెక్టుని ఎవరు నిర్మిస్తారు అనేది పెద్ద ప్రశ్న. మరొక్క విషయం ఏంటంటే.. వెంకటేష్ స్క్రిప్ట్ మొత్తం వింటేనే కానీ సినిమాని కన్ఫర్మ్ చేయడు. చూడాలి మరి..!

 

Read more : యూట్యూబ్ లో రికార్డు సృష్టించిన ‘ఇంద్ర’ నటి కూతురి డాన్స్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *