`పంచతంత్ర కథలు` చిత్రం నుండీ … నేనేమో మోతెవరి..నువ్వేమో తోతాపరి…
నా గుండెల సరాసరి..కుర్సియేసి కూసొబెడతనే…
నీ అయ్యా పట్వారి..నీ చిచ్చా దార్కారి…
ఏదైతే ఏందే మరి…నిన్నుఎత్తుకొనిబోతనే…అంటూ ఆహ్లాదరకరంగా సాగే పాటని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ‘మధు క్రియేషన్స్’ బ్యానర్ పై ‘ప్రొడక్షన్ నెం.1’ గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈయనకి ఇదే మొదటి చిత్రం. 5 వేరు వేరు కథల ఆంథాలజి కావడంతో ఈ మూవీకి `పంచతంత్ర కథలు` అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకి రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా `మోతెవరి` అనే మొదటి లిరికల్ సాంగ్ ను టాలీవుడ్ క్రేజీ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు.
కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకి సంగీత దర్శకుడు కమ్రాన్ అందించిన ట్యూన్ క్యాచీగా ఉంది. రామ్ మిరియాల ఈ పాటను తనదైన శైలిలో ఆలపించి ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ లిస్ట్ లో చేర్చాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా..
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ… “పంచతంత్ర కథలు సినిమాలోని `నేనేమో మోతెవరి` సాంగ్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇది నా ఫేవరేట్ సాంగ్. ఈ సినిమా రఫ్ కట్ చూసినప్పుడే ఈ సాంగ్ విన్నాను. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. తప్పకుండా వైరల్ అవుతుందనే నమ్మకం నాకు కలిగింది. కాసర్ల శ్యామ్ గారు మంచి సాహిత్యం అందించారు. రామ్ మిరియాల అందరి ఫేవరేట్. ఇక సంగీత దర్శకుడు కమ్రాన్ చాలా కాలం నుండీ తెలుసు. మంచి ట్యూన్ అందించాడు. లిరికల్ వీడియోలో దర్శకుడు శేఖర్ మేకింగ్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. సర్ప్రైజింగ్గా మా అమ్మగారితో కూడా ఒక క్యారెక్టర్ చేయించారు. ఈ సినిమా కోసం ఎగ్జయిటింగ్గా ఎదురుచూస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అంటూ చెప్పుకొచ్చారు.
Read More : అంతలోనే ఎంత మార్పు.. కోలీవుడ్కి షాకిచ్చిన నయనతార