priyamani : ప్రియమణితో 4 ఏళ్ళు ఎఫైర్ నడిపిన హీరో ఎవరో తెలుసా?

News

టాలీవుడ్ బడా నిర్మాత కె.ఎస్.రామారావు కొడుకు వల్లభ హీరోగా ఓ మూవీ చేశాడు. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు.ఆ మూవీనే ‘ఎవరే అతగాడు’. 2003 జనవరి 11 న రిలీజ్ అయ్యింది. అయితే అదే టైంకి ఎన్టీఆర్ ‘నాగ’, మహేష్ బాబు ‘ఒక్కడు’ , రవితేజ ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ , శ్రీకాంత్ – వేణు ల ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటి దెబ్బకి ‘ఎవరే అతగాడు’ సినిమా నిలబడలేకపోయింది.

అయితే ఈ చిత్రం ద్వారా ప్రియమణి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే చాలా మంది ఆమె మొదటి సినిమా ‘పెళ్ళైన కొత్తలో’ అని చెబుతూ ఉంటారు. కానీ మొదటి సినిమా ‘ఎవరే అతగాడు’. ‘పెళ్ళైన కొత్తలో’ సినిమా హిట్ అవ్వడంతో జగపతి బాబు – ప్రియమణి ల జంటకి మంచి మార్కులు పడ్డాయి. అందుకే అదే కాంబినేషన్లో ‘ప్రవరాఖ్యుడు’ ‘సాధ్యం’ వంటి సినిమాలు కూడా వచ్చాయి.’క్షేత్రం’ అనే ఇంకో సినిమా కూడా వచ్చింది.

అయితే ప్రియమణి – జగపతి బాబు ల మధ్య అప్పట్లో ఎఫైర్ నడిచిందని కొంతమంది అంటుంటారు. 2 ఏళ్ళ పాటు వీళ్ళు ఫుల్ గా తిరిగి ఎంజాయ్ చేసారని ఇన్సైడ్ టాక్ గట్టిగా వినిపించింది. ప్రియమణికి జగపతి బాబు ఇల్లు కూడా రాసిచ్చేసాడు అని అప్పట్లో జగపతి సన్నిహితులే నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. అయితే రెండేళ్ల తర్వాత వీళ్ళ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. అటు తర్వాత ప్రియమణి .. లవర్ బాయ్ తరుణ్ తో డేటింగ్ చేసిందట. దాదాపు 4 ఏళ్ళ పాటు ఈమె అతనితో డేటింగ్ చేయడం జరిగిందట. తరుణ్.. ప్రియమణికి ఓ ఖరీదైన కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్టు అప్పట్లో కథనాలు పుట్టుకొచ్చాయి. పెళ్లి చేసుకోవడానికి కూడా వీళ్ళు రెడీ అయ్యారట. కానీ తరుణ్ కుటుంబ సభ్యులు ప్రియమణి – జగపతి బాబు ల వ్యవహారం తెలిసి వద్దనుకున్నట్టు సమాచారం.

Read more : adipurush : శ్రీవారి ఆలయం ముందు హీరోయిన్ కు ముద్దులు.. ఆదిపురుష్ దర్శకుడి పై ట్రోలింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *